February 26, 2026

Telangana Farmers : అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ

Telangana Farmers : ఇవాళ మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం 1,551.89 కోట్లు విడుదల చేశామన్నారు. దీని ద్వారా 10.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *