August 26, 2025

Bhadrakali Temple : భద్రకాళికి పోటె త్తిన భక్తులు

Bhadrakali Temple : శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించారు. భక్తులు ఉదయం నుండి అమ్మవారి దర్శనమునకు బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, మంచినీరు మరియు ప్రసాద వితరణ ఏర్పాట్లు దేవాలయ చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు శ్రీ తొనుపునూరి వీరన్న, శ్రీ గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీమతి గాండ్ల స్రవంతి, శ్రీ ఓరుగంటి పూర్ణచందర్. శ్రీ పాలడుగల ఆంజనేయులు, శ్రీ బింగి సతీష్ లు పర్యవేక్షించారు.

ఈ రోజు అమ్మవారిని ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టి.ఎస్. ఐ.ఏ.ఎస్ కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్కు ఆలయ ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. పూజానంతరం అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *