February 25, 2026

Warangal Commissionerate : వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్నవాహనా యజమానులకు నోటీసులు

Warangal Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సి.ఆర్ పి. ఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. వాటిని పోలీస్ స్టేషన్ల వారిగా గుర్తించి సబంధిత వాహన యజమానులకు నోటీసులు కూడా పంపారనీ. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహ నాలను తిరిగి అంద జేయనున్నారు. మరింత సమాచారం కోసం సిసి ఆర్ బి ఏసీపీ డేవిడ్ రాజ్ సంప్రదించండి లేదా యం. టి. ఓ రిజర్వ్ ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ ,8712685158, సిసి ఆర్.బి ఇన్స్ స్పెక్టర్ మల్లయ్య 8008389789 నంబర్లను సంప్రదించాలని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *